త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. స్వామి తల్లి అలివేలు మంగ(85) కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గత రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి శోకసంద్రంలో మునిగిపోయారు.
తల్లి మృతితో చినజీయర్ స్వామి తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమం సమీపంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలిపారు.