గాల్వన్ లోయ వద్ద చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, సమగ్రతకు వంటి అంశాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా కూడా భారత్ బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్లను నిషేధించే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.
చైనాపై భారత్ నిషేధం విధించడాన్ని ఇటీవలే అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ చర్య దోహదపడుతుందని ఇటీవలే మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ టిక్ టాక్ను నిషేధించాలని తమ ప్రభుత్వానికి ఇటీవల జాతీయ భద్రతా సలహాదారులు సూచనలు చేశారు. ఇటువంటి యాప్ల ద్వారా చైనా ప్రభుత్వం అమెరికా పౌరుల డేటాను కొట్టేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్, కేసీఆర్ చొరవను అభినందిస్తున్నా: కేశినేని నాని