telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

బావిలోకి దూసుకెళ్లిన స్కూల్‌ వ్యాన్‌.. నలుగురు విద్యార్థులు మృతి

Accident

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజాపూర్‌ జిల్లాలోని రిచ్చోడాలో విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల వ్యాను అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యానులో మొత్తం 25 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Related posts