ప్రత్యేక కోర్టు చిదంబరం తన ఇంటి నుండి బోజనం తెప్పించుకునేందుకు అనుమతించింది. ఆయన 17వ తేదీ వరకు తీహార్ జైలులోనే ఉంటారని ప్రత్యేక కోర్టు పేర్కొంది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా, అంతకుముందు ఆయన చేసుకున్న అభ్యర్థన మేరకు ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది. అదేవిధంగా ఒక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించుకునేందుకు అనుమతివ్వాలని చిదంబరం తరుపు న్యాయవాదుల బృందం చేసిన విజ్ఞప్తికి కూడా కోర్టు సానుకూలత వ్యక్తం చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హై కోర్టు సోమవారం తోసిపుచ్చడంతో ఆయన జైలు కస్టడీ పొడిగించబడింది. చిదంబరం సెప్టెంబరు 5 నుండి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.