telugu navyamedia
Uncategorized

మావోయిస్టుల చేతిలో జ‌వాన్ హతం

maoist naksals

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని న‌క్స‌ల్స్ ప్ర‌భావిత జిల్లా అయిన దంతేవాడ‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల చేతిలో ఓ జ‌వాన్ హ‌త్య‌కు గుర‌య్యాడు. గత ఏడు రోజుల క్రితం ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన జ‌వాన్ క‌‌నిపించ‌కుండా పోయాడు. గాలింపు చేస్తుండగా ఆయ‌న మృత‌దేహం బీజాపూర్ జిల్లాలోని పెద్దాడా గ్రామం వ‌ద్ద‌ రోడ్డుపై క‌నిపించింద‌ని దంతేవాడ జిల్లా ఎస్పీ క‌మ్‌లోచ‌న్ క‌శ్య‌ప్ వెల్ల‌డించారు.

మృతి చెందిన జ‌వాన్ గ‌త ఏడు రోజుల క్రితం త‌ప్పిపోయాడాని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల చేతిలో పోలీసులు చ‌నిపోవ‌డి గ‌త 20 రోజుల్లో ఇది మూడోసారి. సెప్టెంబ‌ర్ 1న దంతేవాడా జిల్లాలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను మావోయిస్టులు హతమార్చారు.

Related posts