చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జరిగిన అన్యాయంపై వికారాబాద్ లో ఆయన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక కొత్త ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా సాగు నీటిని ఇవ్వలేకపోయారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరి