telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జనవరి 29న “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్…

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 29 న “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్ అవుతుంది. శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవరూ నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించుకుంది.ఈ నెల 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా

సినిమా హీరో మరియు డైరెక్టర్ మాట్లాడుతూ … ఈ నెల 29 న వస్తున్న మా సినిమాతో పాటు నాలుగు,ఐదు సినిమాలు ఉన్నాయి. వారందరినీ దీటుగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.ట్రైలర్ చూసిన ప్రేక్షకుల నుండి మాకు ఇప్పటికే మంచి ప్రశంశలు వచ్చాయి.ఈ సినిమాకు నేను మొదటి దర్శకుడినైనా డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారి నుండి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ… మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న “చెప్పినా ఎవరు నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించు కున్నాము. మేము విడుదల చేసిన ట్రైలర్,ఫస్ట్ లుక్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారికి మా కృతజ్ఞతలు.
ఈ చిత్రాన్ని న్యాచురల్ లోసెషన్స్ లలో రియలిస్టిక్ గా తీయడం జరిగింది.ఈ నెల 29 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. చూసిన ప్రతి ఒక్కరికీ మా చిత్రం కనెక్ట్ అవుతుంది.మా బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మన్నన పొందుతామని అన్నారు..

తారాగణం:
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు

సాంకేతిక విభాగం:

బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగదీశ్ వేముల
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్
పి. ఆర్. ఓ: మధు వి.ఆర్.

Related posts