telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” నుంచి రెబల్ అభిమానులకు మరో సర్ప్రైజ్

Saaho

“బాహుబ‌లి” చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం “సాహో”. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్‌ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. తాజాగా అభిమానులకు `సాహో` టీమ్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. `సాహో` గేమ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ట్రైలర్‌ను విడుదల చేశాడు. సినిమా తరహాలోనే ఈ గేమ్ కూడా ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

Related posts