telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

నిరుద్యోగులను నిలువునా ముంచిన మాయలేడి అరెస్ట్

SIT Investigation YS viveka Murder

ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను బుట్టలో వేసుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన మాయ లేడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లా బొంత కోడూరుకు చెందిన పద్మజ ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వల విసిరింది. దీంతో ఆమె మాటలు నమ్మిన నిరుద్యోగులు లక్షల రూపాయలను కట్టబెట్టారు.

కలెక్టర్ సహా ఉన్నతాధికారులందరి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీలను తయారు చేయించింది. దాదాపు పది కోట్ల వరకూ నిరుద్యోగుల నుంచి వసూలు చేసి మాయమైంది. దీంతో ఆమె కారణంగా మోసపోయిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు ఎట్టకేలకు ఆ మాయలేడి పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts