ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని సీతాగోటా అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు పోలీసు బలగాలకు నిఘావర్గాలు సమాచారం అందించాయి. వెంటనే అప్రమత్తమైన డీఆర్జీ ప్రత్యేకదళం కూంబింగ్ ప్రారంభించింది. అడవిలోకి కొద్దిదూరం వెళ్లగానే బలగాల రాకను పసిగట్టిన మావోలు బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మిగతా నక్సల్స్ కాల్పులు జరుపుతూ ఘటనాస్థలి నుంచి అడవిలోకి పరారయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి భారీ సంఖ్యలో తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపటారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేమీ జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ భయంతో వణికిపోతున్నారు.
రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాట: లోకేశ్