చార్మినార్ లోని ఆయుర్వేద భవన్ ని తరలించ వద్దని నిన్న అక్కడి వైద్య విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ-కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఘాటుగా స్పందించారు.వైద్య విద్యార్థినులు ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు తప్పుగా ప్రవర్తించారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణిని ఆయన కలిశారు. అనంతరం మీడియాతో వీహెచ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీన్ని తరలించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆసుపత్రి భవనం పాతది కనుక అక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్పడం సబబు కాదని, ఉస్మానియా ఆసుపత్రి కూడా పాత దైనా అక్కడే వైద్యం కొనసాగుతోందని అన్నారు. అక్కడి నిర్మిస్తామని చెప్పిన ఆసుపత్రి కొత్త భవనం ఏమైందని వీహెచ్ ప్రశ్నించారు.
బలనిరూపణ వెనుక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కుమారస్వామి