telugu navyamedia
సినిమా వార్తలు

ఏ టైం కి పుట్టావ్ తల్లి నువ్వు..?… సమంతపై ఛార్మి కామెంట్స్

Samantha-and-CHarmee

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది.

ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెల‌బ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఛార్మీ త‌న ట్విట్ట‌ర్‌లో ”ఏ టైం కి పుట్టావ్ అమ్మ నువ్వు..? నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్ అండ్ నీ జాతకంకి నమస్కారం” అంటూ స‌మంత‌ని ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసింది. దీనికి స‌మాధానంగా “నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. నీకు నా ఆత్మీయ కౌగిలి, ముద్దుల్ని పంపుతున్నా” అని ట్వీట్ చేసింది స‌మంత‌. వీరిద్దరి మ‌ధ్య సాగిన ట్వీట్ చ‌ర్చ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి ప్ర‌స్తుతం నిర్మాత‌గా కొన‌సాగుతుంది. ఆమె నిర్మాణంలో రూపొందిన “ఇస్మార్ట్ శంక‌ర్” చిత్రం జూలై 18న విడుదల కానున్న విష‌యం తెలిసిందే.

Related posts