చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో దళితులను ఓటు వేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో మరో రెండు పోలింగ్ కేంద్రాలను ఈసీ చేర్చింది.
నియోజకవర్గంలో మరో రెండు (310, 323) ఎన్నికల కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. ఈ రెండు పోలింగ్ బూత్లకు కూడా ఆదివారం రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మొత్తం 7 సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రద్యుమ్న పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికల ఫుటేజీ ఎక్కడా లీక్ కాలేదని, ఈసీకి మాత్రమే ఫుటేజీని పంపించామని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు.
ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేదేమీ లేదు: జగ్గారెడ్డి