ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ తల్లి మదనమ్మ గుండెపోటుతో మృతి చెందారు. చంద్రబోస్ అమ్మ గురించి ఎన్నో పాటలు రాశారు. అందులో “పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ… కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ” అనే పాట ప్రతిఒక్కరికీ ఇప్పటికీ ఇష్టమే. చంద్రబోస్ తండ్రి పేరు నర్సయ్య. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నర్సయ్య, మదనమ్మకి నలుగురు సంతానం కాగా చంద్రబోస్ చిన్నవాడు. ప్రస్తుతం సినీ రచయితగా పని చేస్తూనే పలు షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు చంద్సబోస్. వారి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్ తల్లి అంత్యక్రియలు జరిగాయి. మదనమ్మ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
previous post