టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు జనసేనాని పవన్ కల్యాణ్ మనసు గాయపడేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు పవన్ మనసు గాయపడేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలనకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు. అన్నా అంటూనే ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని గంగలో ముంచేశారని వ్యాఖ్యానించారు. జగన్ కు డబ్బు పిచ్చి వదలదని అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా జగన్ వైఖరి ఉందన్నారు. సాయంత్రం ఐదు గంటలైతే చాలు వీడియో గేములు ఆడుకుంటూ కూర్చుంటున్నారని ఆరోపించారు.