telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ప్రధాని మోడికి చంద్రబాబు లేఖ

Chandrababu comments Jagan cases
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం  చంద్రబాబు  లేఖ రాశారు.  వైఎస్‌ జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థక అప్పగించడం పై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని అన్నారు. కేంద్రం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. 
విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. 2008లో ఎన్‌ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారని లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్‌పై దాడి కేసును ఆ సంస్థకు అప్పగించారన్నారు. ఎన్‌ఐఏ చట్టంపై మోదీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Related posts