ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు ఆయన లేఖను పంపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా జగన్ కు వ్యక్తిగతంగానూ, తెలుగుదేశం పార్టీ తరఫునా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిపక్షనేతగా తనవంతు సహకారం అందిస్తానని జగన్ కు హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే పరమావధిగా పరిపాలన సాగించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా పాలన ఉండాలని చంద్రబాబు తన లేఖలో ఆకాంక్షించారు. ప్రజాసమస్యల పరిష్కారాన్ని సత్వర ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని తెలిపారు.