telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ మర్యాదగా ఉండు..నేను రెచ్చిపోవాల్సి వస్తుంది!: చంద్రబాబు

Chandrababu fire to CM KCR

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అనవసరంగా మీరు రెచ్చిపోతే… మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుందని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల సమాచారాన్ని హైదరాబాద్ లో ఓ సంస్థ నిర్వహిస్తుంటే ఆటంకాలు కలిగిస్తూతెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ ఏపీలోని ప్రజల డేటాను బహిర్గతం చేస్తోందన్న ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటన పై స్పందించిన చంద్రబాబు కేసీఆర్ లక్ష్యంగా ఘాటు విమర్శలు గుప్పించారు. తమకు సేవ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని, తానిస్తున్న మర్యాదను కేసీఆర్ తప్పితే చూస్తూ ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.

మాకు సేవ చేసే కంపెనీపై తెలంగాణ ఏసీబీ పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క నరేంద్ర మోదీ దాడులు చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే మరో పక్క కేసీఆర్ మన ఆస్తులపైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. ఈ రెండూ కూడా ఎంతోకాలం సాగవు. ఈ విషయాన్ని అంతా తేలికగా విదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ దాడుల పై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకు రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారని ప్రశ్నించారు. మర్యాదకు మర్యాద ఇచ్చిపుచ్కుకోవాలి అనవసరంగా మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related posts