టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంధుత్వాలు, స్నేహం పేరుతో పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడితే చూస్తూ ఊరుకునేది సూచించారు.
ఏపీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకునేందుకు దేవాలయానికి వచ్చి ఎవరైనా రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, అదే టీఆర్ఎస్ నేతలు ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి గొంగళి పురుగు జగన్ ని కేసీఆర్ కౌగిలించుకున్నారన్నారు.