telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని పరిరక్షణ కోసం .. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు..

chandrababu visited vijayawada durgamma on capital

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సతీ సమేతంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఇఒ ఎం.వి.సురేష్‌బాబు శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం చందబ్రాబుకు అందజేశారు. అనంతరం విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతిని పరిరక్షించాలని, భవిష్యత్తు తరాలు బాగుండాలని, రాష్ట్రాన్ని కాపాడాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు తెలిపారు.

చంద్రబాబు వెంట ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు దేవస్థానం ఇఒ ఎం.వి.సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు దేవినేని అవినాష్‌ ఉన్నారు.

Related posts