telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాయలసీమలో నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు

chandrababu on amaravati mla quarters

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పామర్రు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల వల్ల వాణిజ్య పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంతో వ్యవహరించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

కనీసం ముందస్తు హెచ్చరిక లేకుండా ఒకేసారి నీటిని వదిలేయడంతో అపారమైన నష్టం జరిగిందన్నారు. వర్షాలు ఇక్కడ పడలేదని, పై ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఇంటిపై పెట్టిన దృష్టిలో సగ భాగం ప్రభుత్వం ప్రజల మీద పెట్టినా ఇంత నష్టం జరిగేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమలో నీరు లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని, ప్రభుత్వానికి కనీస బాధ్యత కూడా లేదని విమర్శించారు.

Related posts