telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్న ఆరోగ్యం దెబ్బతింది: చంద్రబాబు

chandrababu

వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యపరిస్థితి దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత ,ప్రలోభాలకు లొంగలేదనే పగసాధిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు అంతం లేకుండా పోయిందని మండిపడ్డారు. మొన్న అచ్చెన్నాయుడిపై దురాగతం చేశారని, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల, చినరాజప్పలపై తప్పుడు కేసులు బనాయించడం కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని అన్నారు.

Related posts