telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏ మొహం పెట్టుకుని అమరావతిలో పర్యటిస్తున్నారు: చంద్రబాబు పై రోజా ఫైర్

roja ycp mla

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు కాన్వాయి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ వ్యవహరంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ మొహం పెట్టుకుని బాబు అమరావతిలో పర్యటిస్తున్నారని  ప్రశ్నించారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా? భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు అమరావతి ఎందుకు వెళ్లారు? తన బినామీల పేర్లతో తీసుకున్న ల్యాండ్ల సరిహద్దులు సరిగా వున్నాయా? లేవా? అని చూడడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. లేక పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములు వున్నాయా? లేవా? అని చూసేందుకు వెళ్లారా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అమరావతిని భ్రమరావతిగా చూపించారని విమర్శించారు.

Related posts