telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ నాయ‌కుల‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

tdp chandrababu

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్‌లు బీజేపీలో చేరిన విషయం విదితమే. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం కాషాయ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో వారిని బాబు బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.విదేశీ పర్యటనలో ఉన్న బాబు పార్టీ నాయ‌కుల‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ప్రజావేదిక స్వాధీనం, బీజేపీలోకి ఎంపీల ఫిరాయింపు అంశాల‌పై కీలకంగా చ‌ర్చిస్తున్నారు.

Related posts