ఢిల్లీలో సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్ష పై పలువురు నేతలు ప్రశంసలు, మరికొందరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష ప్లాప్ అనడం రాష్ట్ర ద్రోహమని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 17 పార్టీల ప్రతినిధులు పాల్గొనడం ప్లాప్ షో నా..? లేక దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడం ప్లాప్ షో నా..? అని సీఎం ప్రశ్నించారు.
ధర్మపోరాటాన్ని విమర్శిస్తోంది బీజేపీ, వైసీపీనే అని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకేని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా వాసి అర్జున్రావు ఆత్మహత్య బాధాకరమన్నారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని వినతి చేశారు. ఢిల్లీలో రాబోయేది ఏపీకి హోదా ఇచ్చే ప్రభుత్వమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.