రెచ్చగొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీరు-ప్రగతి’పై చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గండ్లుకొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిత్తూరులో కుప్పం వరకు నీళ్లు ఇవ్వగలగాలన్నారు. అనంతపురంలో హిందూపురం, మడకశిరకు నీళ్లు చేరాలన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం-ప్రగతి సాధిస్తున్నామన్నారు. రాయలసీమ ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు.
వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి కొరత అధిగమిస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మన లక్ష్యమన్నారు. పంచనదుల అనుసంధానంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశామని చంద్రబాబు అన్నారు. చిత్తూరు మెట్ట ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు.