telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రెచ్చగొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలి: చంద్రబాబు

రెచ్చగొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీరు-ప్రగతి’పై  చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. గండ్లుకొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిత్తూరులో కుప్పం వరకు నీళ్లు ఇవ్వగలగాలన్నారు. అనంతపురంలో హిందూపురం, మడకశిరకు నీళ్లు చేరాలన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం-ప్రగతి సాధిస్తున్నామన్నారు. రాయలసీమ ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. 
వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి కొరత అధిగమిస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మన లక్ష్యమన్నారు. పంచనదుల అనుసంధానంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశామని చంద్రబాబు అన్నారు. చిత్తూరు మెట్ట ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు.

Related posts