అమరావతి ప్రాంత మహిళలు గుడికి వెళుతూంటే వారిని పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. మహిళలపై పోలీసులు దాడి అమానుషమని విమర్శించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంకు వెళుతున్న మహిళలపై పోలీసులు ఇదే తరహాలో వ్యవహరించారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి వాళ్ల గ్రామ దేవతలని పూజించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్లకపోతే మీలాగా కోర్టుకు వెళ్లమంటారా? అని ప్రశ్నించారు. రైతులు గుడికే వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?’ అని చంద్రబాబు ట్విటర్ లో పేర్కొన్నారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య