telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు

chandrababu

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై రోజుకో కేసు పెడుతూ, బెయిల్ రాకుండా చేస్తున్నారని విమర్శించారు.

Related posts