telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’కి చంద్రబాబు శంకుస్థాపన

another airport in rayalaseema today by apcm
ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్‌ ఏరియాలో  ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు  గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా ఆరు నెలల్లో గ్యాలరీ భవన నిర్మాణం జరుగనుంది.
ఈ ప్రాజెక్టును ఐదు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ (ఏడీపీ) చేపడుతోంది. సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో  ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

Related posts