telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దిష్టి తీసి బాబును ప్రచారానికి సాగనంపిన భువనేశ్వరి

Chandrababu starts Election compaign

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ఎదురుగా వచ్చి కొబ్బరికాయతో దిష్టితీసి సాగనంపారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో ఆయన తిరుపతికి బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళతారు. అక్కడి నుంచే సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

Related posts