లాక్ డౌన్ సమయంలో లో దేశవ్యాప్తంగా ఎందరికో చేయూతనిచ్చి, ఆదుకున్న బాలీవుడ్ విలన్ సోనూ సూద్ కు తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ప్రతిష్ఠాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోనూ సూద్ కు ఈ అవార్డు దక్కడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. అవార్డును పొందడంపై సోనూకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “మరింత మెరగైన ప్రపంచానికి మీ వంటి వారి అవసరం ఎంతైనా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు సోనూ సూద్ సాయం చేశారు. వారి కోసం ప్రత్యేక బస్సులు,రైళ్లతో పాటు విమానాలను కూడా బుక్ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.