telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌కు కన్నా అద్దె మైకు: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

వైఎస్ జగన్‌ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ అద్దె మైకు వంటి వాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. నిన్న ఏలూరులో జరిగిన బీసీ సభలో వైఎస్ జగన్ ఎంతో ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని చంద్రబాబు అన్నారు. సోమవారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీకి వెన్నుదన్ను బీసీలే అని అది వైసీపీకి మింగుడు పడటం లేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు తామే చట్టబద్ధత కల్పించామని, అయితే మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్ అనడం అవగాహనా రాహిత్యమే అని పేర్కొన్నారు.

ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని, ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేతలతో సీఎం అన్నారు. ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. వైఎస్ పాలనలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో కౌలు రైతు కుటుంబానికి రూ.15వేల చొప్పున ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కాపుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.

Related posts