బీజేపీ-కోడికత్తి పార్టీ రెండూ ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాఫెల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పడ్డారని ఆయన మండిపడ్డారు. ఆదివారం కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం పునాదిపాడులో జరుగుతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి సాయం చేయదని, మనం ఏదైనా చేద్దామంటే ఇక్కడి పార్టీలు అడ్డుపడుతున్నాయన్నారు.
పెట్టుబడుల కోసం దావోస్ వెళ్దామనుకుంటే అడ్డుపడ్డారని, గుజరాత్ను ఏపీ దాటి పోతోందని మోదీకి భయం పట్టుకుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో విద్యుత్ అంతా సోలార్ ద్వారానే వస్తోందని, రాబోయే రోజుల్లో వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మారతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయుకాలుష్యం తగ్గుతుందన్నారు.