telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రాష్ట్ర ప్రజలకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు: చంద్రబాబు

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శూక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు. అతులిత బలదాముడు శ్రీ ఆంజనేయుడు అందరికి శక్తి, సామర్థ్యాలనివ్వాలని కోరుకుంటున్నాను” అని వ్యాఖ్యానించారు. 
నేడు హనుమజ్జయంతి సందర్భంగా దేవాలయాలు భక్తులతో  కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు హనుమాలయాలను సందర్శించి, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.  హైదరాబాద్ లో  హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలతో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గకుండా ప్రత్యామ్నయ మార్గాల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. కోటీ నుంచి సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకూ రహదారులపై ఆంక్షలు విధించారు.

Related posts