ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, శరద్పవార్, శరద్యాదవ్, సురవరం సుధాకర్రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో రాహుల్కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా పరిణామాలపై చంద్రబాబు రాహుల్కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించనున్నారు.