telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ నుంచి లక్నో బయలుదేరిన చంద్రబాబు

chandrababu gift on may day

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో రాహుల్‌కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా పరిణామాలపై చంద్రబాబు రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించనున్నారు.

Related posts