telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో వున్న నాల్గవ అడిషినల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి  ముందు ప్రమాణం చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి స్థానికంగా ఎన్నికల కమీషన్ చేత నియమింపబడిన రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ప్రమాణం చేయలేకపోయారు.

ఎన్నికల హడావిడి కారణంగా చంద్రబాబు తాను పోటీ చేసే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేకపోయారు. ఆయన తరపున స్థానిక టిడిపి నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. దీంతో రిటర్నింగ్ అధికారి ముందు కాకుండా చంద్రబాబు ఇవాళ ఉదయం చంద్రబాబు సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు.

Related posts