telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

19న ర్యాలీకి.. సిద్ధం అవుతున్న .. చంద్రబాబు… 

Chandrababu give Clarity Congress Aliance
దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేక శక్తులను ఏకం చేసి, కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేయాలనీ ప్రయత్నిస్తున్న విషయం విదితమే. దానిలో భాగంగానే ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలని కాంగ్రెస్ భావించింది. ఇప్పటికే ఆయా పార్టీలతో చర్చలు జరగటం, కొందరు సై అనడం, మరికొందరు నాన్చడం, ఇంకొందరు కుదరదు అనడం జరిగిపోయింది. అయినప్పటికీ వదలకుండా, బుజ్జగించే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ వొచ్చిన ప్రధాన సమస్య ప్రధాని అభ్యర్థిత్వం. ఈ పాయింట్ లక్ష్యంగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు వాటివాటి బాలలను జాతీయం గా గుర్తింపబడాలని వారివారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగానే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఈ నెల 19న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, శరద్ పవార్, బాబూలాల్ మరాండీ తదితరులు కూడా హాజరుకానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ర్యాలీకి హాజరు కావాలని మమత ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అలాగే, మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ర్యాలీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ర్యాలీకి హాజరు కానున్నట్టు సమాచారం. కోల్‌కతా ర్యాలీ తర్వాత జాతీయ స్థాయిలో ‘మహాకూటమి’కి ఓ రూపు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ఈ నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ర్యాలీ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు రాజకీయనిపుణులు భావిస్తున్నారు.

Related posts