telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ నాని వ్యవహారం హాట్‌ టాపిక్‌.. చంద్రబాబు ఫోన్

kesineni nani tdp

ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. లోక్‌సభలో టీడీపీ విప్‌గా కేశినేని నానిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నాని తిరస్కరించారు. దీంతో నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఎంపీ నానికి ఫోన్ చేశారు. సాయంత్రం తన నివాసానికి రావాల్సిందిగా సూచించారు.సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మూడు ఎంపీ స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ ముగ్గురు ఎంపీలకు ఒక్కొక్క పదవి కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆమేరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ గల్లా జయదేవ్‌ను, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ రామ్మోహన్ నాయుడును, విప్‌గా కేశినేని నానిని నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే.. చంద్రబాబు తనను విప్‌గా నియమిస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని నాని సున్నితంగా తిరస్కరించారు. చంద్రబాబు తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అయితే నాని బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Related posts