సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్ ఆర్థర్ కాటన్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాటన్ను ప్రజలు గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్నారన్నారు. నీటి విలువ తెలిసిన కాటన్ మహాశయుడు కాటన్ అని కొనియాడారు. అపర భగీరథుడుగా పేరొందిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గొప్ప స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా తీర్చిదిద్దిన ఘనత కాటన్దేనన్నారు. కాటన్ స్ఫూర్తితోనే నీరు-ప్రగతి లాంటి జలసంరక్షణ ఉద్యమాలు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కాటన్ స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. జూలై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరానికి నీరందించనున్నట్టు తెలిపారు. పోలవరం పూర్తయితే పోలవరం పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తే మారుతుందని అన్నారు.