telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

65 శాతం పోలవరం పూర్తి అంటున్న.. చంద్రబాబు..

polavaram-updates

నేడు సోమవారం కావడంతో, ఏపీసీఎం చంద్రబాబు పోలవరం పనులను సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 65.04 శాతం పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. పోలవరం పనులు అనుకున్న వేగాన్ని అందుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తికావొచ్చిన నేపథ్యంలో మరింత వేగంగా పనులు ముమ్మరం కావాలన్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు డ్యామ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రోజువారీ పనుల లక్ష్యాన్ని నిర్ణయించాలని, లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ఎర్త్ వర్క్, కాంక్రీట్ పనులు ముమ్మరం చేయాలని సూచించారు. ఎడమ, కుడి కాలువ పనులు వేగం పుంజుకోవాలని అధికారులకు చంద్రబాబు తెలియజేశారు.

Related posts