telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ వైసీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. : చంద్రబాబు

ఏపీలో తాజా పరిస్థితులతో ఎన్నికలు వెళ్లాలని టీడీపీ నేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు. విజయవాడ బెంజ్​సర్కిల్​లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందన్నారు.

అమరావతి చారిత్రక ప్రాధాన్యత కాపాడుకోవాలని బాబు సూచించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

Related posts