దర్శకుడు దేవాకట్టా తాను రాసుకున్న స్క్రిప్ట్ను డైరెక్టర్ రాజ్ కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నట్టు వార్త ఇపుడు టాలీవుడ్లో హాట్టాపిక్ గా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై తాను ఒక కథ సిద్దం చేసుకోవడంతోపాటు ఆ స్క్రిప్ట్ ను రిజిస్టర్ కూడా చేసుకున్నానని, ఇపుడు ఇదే కథ ఆధారంగా డైరెక్టర్ రాజ్ వెబ్సిరీస్ తీస్తున్నారని దేవాకట్టా మండిపడుతున్నారు. కాగా ‘ప్రస్థానం’ లాంటి కల్ట్ క్లాసిక్ ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు దేవాకట్టా. ఎమోషన్.. కామెడీ.. రొమాన్స్ ఈ మూడింటిని తనదైన మార్క్ తో తెరపై ఆవిష్కరించడంలో దేవాకి ప్రత్యేకమైన శైలి ఉంది. నాగచైతన్య- సమంత జంటగా నటించిన ఆటోనగర్ సూర్య బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా ఆ సినిమాలో ఎమోషన్, లవ్, రొమాన్స్ ప్రతిదీ ఆకట్టుకున్నాయన్న ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం జీఎంబీ సంస్థలో ఓ సినిమాతోపాటు సాయిధరమ్తేజ్తో మరో మూవీకి ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
previous post