telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అలా అయితే నగరిలో టీడీపీ గెలిచేది: చంద్రబాబు

chandrababu

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిని ముందు ప్రకటించి ఉంటే టీడీపీ గెలిచేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణానంతరం ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించి ఉంటే టీడీపీ విజయం సాధించేదని అన్నారు. ఆయన కుటుంబసభ్యుల ఒత్తిడితో అభ్యర్థి పేరును ప్రకటించడంలో ఆలస్యమైందని చెప్పారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులంతా కలుస్తారని భావించానని అన్నారు.

కానీ వారిలో వారే ఓటమి కోసం పని చేస్తారని ఊహించలేదని తెలిపారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు శత్రువులను పెంచుకోవడం సరికాదని చెప్పారు. గాలి భాను ప్రకాశ్ కష్టపడితే మంచి నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Related posts