telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తాం: చంద్రబాబు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లా టీడీపీ నేతలతో అమరావతిలో భేటీ అయ్యారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆయన పలు విషయాలు చర్చించారు. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ తెలంగాణను పట్టించుకోవడం లేదనే విమర్శలు సరికాదని అన్నారు. తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తామని అన్నారు. ఇక్కడి నాయకులు వెళ్లిపోయారు గానీ కార్యకర్తలు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు.

కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా వాళ్లు బాగుండాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని అన్నారు. ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి తాము తీసుకున్న నిర్ణయాలతో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

Related posts