ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ఆగ్రహంతో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం మధ్యాహ్నం సీఈసి సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ అరోరాకు ఆయన 18 పేజీల లేఖను సమర్పించారు.
ప్రజలు ఓటేయడానికి అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన దుస్థితిపై చంద్రబాబు సీఈసికి వివరించారు. ఈసీ తీరుపై, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు.