మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 22న సమావేశం కానున్నారు. పోలింగ్ ట్రెండ్పై అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
విపక్షం సూచించినట్టుగానే ఈసీ వ్యవహరించిందని పీలేరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరో వైపు 17 సీ ఫామ్స్ తీసుకోవాలని బాబు పోటీ చేసిన అభ్యర్థులకు సూచించారు. ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరైన సంగతి తెలిసిందే.
జగన్ వి ఒంటెద్దు పోకడలు: పురందేశ్వరి