telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ, అమిత్ షాలు ‘కోడ్’ఉల్లంఘించారు.. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

chandrababu gift on may day

ప్రధాని నరేంద్రమోదీ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.మోదీ, అమిత్ షాలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు.

వీళ్లిద్దరిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఈసీని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే కేదార్ నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలను మోదీ సందర్శించారని ఫిర్యాదు చేశారు. ఈ యాత్రలకు సంబంధించిన వీడియోలు మీడియా నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను అది ప్రభావితం చేస్తుందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.తక్షణమే మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts