telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్ఈసీ పదవీకాలం కుదిస్తూ కొత్త ఆర్డినెన్స్ : గవర్నర్ కు చంద్రబాబు లేఖ

chandrababu

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ సర్కారు ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ కొత్త ఆర్డినెన్స్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీంతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు అంశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు ఈ-మెయిల్ ద్వారా లేఖ రాశారు.

రాజ్యాంగంలో 243 (కె) నిబంధన ప్రకారం 2016లో ఎస్ఈసీని నియమించారని తెలిపారు. ఐదేళ్ల కాలవ్యవధికి నియమితులైన ఆయనను ఇప్పుడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్ ను దొడ్డిదారిన మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అర్ధాంతరంగా ఎస్ఈసీని మార్చడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.

Related posts