చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కె.చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణవార్త ఆవేదనను కలిగించిందని చెప్పారు.
చంద్రమౌళి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. చంద్రబాబు పై ఆయన రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఐఏఎస్ అధికారిగా చంద్రమౌళి వివిధ శాఖలలో ఉత్తమ సేవలను అందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.