telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అవినీతిని ప్రశ్నించాడనే రవీంద్రను అరెస్ట్ చేశారు: చంద్రబాబు

chandrababu

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఓ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ వైసీపీ అవినీతిని ప్రశ్నించాడనే కొల్లు రవీంద్రను హత్యకేసులో ఇరికించారని ఆరోపించారు. కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి అని పేర్కొన్నారు.

కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని, రెండు కుటుంబాల మధ్య కక్షలు రెచ్చగొట్టింది వైసీపీనే అని అన్నారు. 13 నెలలైనా వైఎస్ వివేకా హంతకులను పట్టుకోలేకపోయారని చంద్రబాబు విమర్శించారు.

Related posts